భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో గల హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రంను ప్రారంభిస్తున్నట్లు కొత్తగూడెం పోస్ట్ మాస్టర్ ఎన్ వి ఎల్ ప్రసన్న గురువారం తెలిపారు.ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.ఆధార్ కార్డుల్లో తప్పుల సవరణలు,కొత్త ఆధార్ కార్డులను నమోదు చేయడం,తదితర సేవలు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి సవరణకు రుసుము రూ.50/- నుండి 100/~వరకు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Post Views: 40