UPDATES  

NEWS

 గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్.

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్.ఈ సందర్భంగా ఒక మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఆయన  మాట్లాడుతూ…  ఐటిడిఎ భద్రాచలం పీవో రాహుల్ సూచనలతో అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా ఇంజనీరింగ్ శాఖ అధికారులు కృషి చేస్తున్నారన్నారు.అదేవిధంగా ఇంజనీరింగ్ శాఖ ఎదుర్కొంటున్నారని పలు అంశాలపై ఏడీ సర్వేశ్వర రెడ్డికి విన్నవించారు.ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకు సేవలు అందించే ఐటిడిఎ ఇంజనీరింగ్ అధికారులకు కూడా కొత్త కార్యాలయ భవనం,స్టాఫ్ క్వార్టర్స్ మంజూరు చేయాలి అని అడిషనల్ సెక్రటరీని ఆయన కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest