UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల మహాత్మా గాంధీ విగ్రహం ప్రక్కన గత కొంతకాలంగా వైన్ షాప్ నిర్వహించడం వలన ఆ చుట్టుపక్కల ఇండ్ల లో నివాసం ఉంటున్న కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఇక్కడి వైన్ షాప్ ను జనవాసులకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని అక్కడి ఇండ్ల యజమానులు మిట్టపల్లి చంద్రకాంత్ రెడ్డి, దూడ లచ్చయ్య, రాజ మల్లయ్య, తో పాటు మరికొందరు గురువారం ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశంలో వారి గోడు వెళ్ళబోసుకున్నారు. మద్యం ప్రియులు పోద్దంత, రాత్రంతా వైన్ షాప్ పక్కన ఉన్న సిట్టింగులో మద్యం త్రాగుతూ మూత్రం చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు అసౌకర్యంగా ఏర్పడి దుర్వాసనతో అనేక రోగాల బారిన పడుతున్నామని పేర్కొన్నారు. మహిళలు ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారని వైన్ షాప్ కు సమీపంలో గాంధీ విగ్రహంతో పాటు చర్చి ఉండడం చేత అక్కడికి వచ్చే భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. వైన్ షాప్ చుట్టూరా మద్యం సీసాలు గ్లాసులతో నిండిపోవడం విచ్చలవిడిగా మూత్రం చేస్తూ మహిళలకు అసౌకర్యంగా మారినందున నూతనంగా వచ్చే మద్యం షాపును జనవాసులకు దూరంగా ఉంచాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, జిల్లా కలెక్టర్ కు, పెద్దపల్లి ఎక్స్చేంజ్ అధికారులకు, పెద్దపల్లి ఆర్డీఓ కు, ధర్మారం తహశీల్దార్ కు దరఖాస్తులు చేశామని తమకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు.

Editor Reporter
telanganavanidaily.com

జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల మహాత్మా గాంధీ విగ్రహం ప్రక్కన గత కొంతకాలంగా వైన్ షాప్ నిర్వహించడం వలన ఆ చుట్టుపక్కల ఇండ్ల లో నివాసం ఉంటున్న కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఇక్కడి వైన్ షాప్ ను జనవాసులకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని అక్కడి ఇండ్ల యజమానులు మిట్టపల్లి చంద్రకాంత్ రెడ్డి, దూడ లచ్చయ్య, రాజ మల్లయ్య, తో పాటు మరికొందరు గురువారం ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశంలో వారి గోడు వెళ్ళబోసుకున్నారు. మద్యం ప్రియులు పోద్దంత, రాత్రంతా వైన్ షాప్ పక్కన ఉన్న సిట్టింగులో మద్యం త్రాగుతూ మూత్రం చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు అసౌకర్యంగా ఏర్పడి దుర్వాసనతో అనేక రోగాల బారిన పడుతున్నామని పేర్కొన్నారు. మహిళలు ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారని వైన్ షాప్ కు సమీపంలో గాంధీ విగ్రహంతో పాటు చర్చి ఉండడం చేత అక్కడికి వచ్చే భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. వైన్ షాప్ చుట్టూరా మద్యం సీసాలు గ్లాసులతో నిండిపోవడం విచ్చలవిడిగా మూత్రం చేస్తూ మహిళలకు అసౌకర్యంగా మారినందున నూతనంగా వచ్చే మద్యం షాపును జనవాసులకు దూరంగా ఉంచాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, జిల్లా కలెక్టర్ కు, పెద్దపల్లి ఎక్స్చేంజ్ అధికారులకు, పెద్దపల్లి ఆర్డీఓ కు, ధర్మారం తహశీల్దార్ కు దరఖాస్తులు చేశామని తమకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest