UPDATES  

 కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ అండ్ బి ఆర్ ఎస్ నాయకులు

కొత్తగూడెం నగరపాలక సంస్థలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మూడ్ గణేష్ నాయక్‌ను పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా 38వ డివిజన్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్, విద్యార్థి విభాగం పాల్వంచ పట్టణ అధ్యక్షుడు జూపెళ్లి దుర్గాప్రసాద్, పాల్వంచ పట్టణ మహిళా అధ్యక్షురాలు బట్టు మంజుల, పార్టీ నాయకుడు వాసుమల్ల గౌతమ్ తదితరులు మేయర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.నగర అభివృద్ధికి తమ పూర్తి సహకారం ఉంటుందని వారు హామీ ఇచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest