UPDATES  

NEWS

ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత

 మాజీ ఉపప్రధాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ కు ఘన నివాళులు:డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మధుకర్

పాల్వంచ:ఉన్నత అధికార ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ పాల్వంచ ఇంజనీరింగ్ సబ్ డివిజన్ నందు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ మధుకర్ మరియు సహాయం ఇంజనీర్లు సీనియర్ అసిస్టెంట్ పాల్గొని చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ మధుకర్ మాట్లాడుతూ.. ఆయన మాట్లాడుతూ..30 సంవత్సరాల పాటు ఆయన దేశానికి అందించిన సేవలు మరువ లేనివన్నారు.గొప్ప రాజకీయ వేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడారని కొనియాడారు.అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని,ఆయన జీవిత పర్యంతం భారతదేశ అభివృద్ధి కోసం అభ్యున్నతికై కృషి చేశారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని గిరిజన ఇంజనీరింగ్ శాఖ బలోపేతం చేయడానికి మరియు అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించి ప్రతి గిరిజన గ్రామానికి ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు పాటు పడాలని సహా ఇంజనీర్లు మరియు సిబ్బంది ఉద్దేశించి డిప్యూటీ ఇంజనీర్ టి.మధుకర్ అన్నారు.ఈ కార్యక్రమంలో సహాయక ఇంజనీర్లు శ్రీకాంత్, యస్వంత్ యోగేష్ మరియు సీనియర్ అసిస్టెంట్ సాధు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest