భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ముస్లిం మైనారిటీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పర్హిన్ మేడంను సోమవారం చిన్నారి ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతి హరిత దీక్ష సభ్యుడు ఎం.డి. అఫాన్ జైదీ మర్యాదపూర్వకంగా కలిసి పచ్చని ఔషధ మొక్కలను అందజేశాడు. ఈ సందర్భంగా పర్హిన్ మేడం అఫాన్ జైదీకి ఆశీర్వాదాలు అందిస్తూ, ప్రకృతి పరిరక్షణ కోసం చేస్తున్న సేవలను అభినందించారు.రామవరం ఇఖ్రా ఆధునిక పాఠశాలలో చదువుతున్న అఫాన్ జైదీ, కె.ఎన్. రాజశేఖర్ స్ఫూర్తితో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. అఫాన్ జైదీ చేస్తున్న ప్రకృతి సేవలను పలువురు ఉపాధ్యాయులు, ప్రకృతి ప్రేమికులు అభినందించారు.
Post Views: 7


