పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ముస్లిం మైనారిటీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పర్హిన్ మేడంను సోమవారం చిన్నారి ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతి హరిత దీక్ష సభ్యుడు ఎం.డి. అఫాన్ జైదీ మర్యాదపూర్వకంగా కలిసి పచ్చని ఔషధ మొక్కలను అందజేశాడు. ఈ సందర్భంగా పర్హిన్ మేడం అఫాన్ జైదీకి ఆశీర్వాదాలు అందిస్తూ, ప్రకృతి పరిరక్షణ కోసం చేస్తున్న సేవలను అభినందించారు.రామవరం ఇఖ్రా ఆధునిక పాఠశాలలో చదువుతున్న అఫాన్ జైదీ, కె.ఎన్. రాజశేఖర్ స్ఫూర్తితో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో […]
సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం
లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్ నగర్ కాలనీ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని సిపిఐ సర్పంచ్ జర్పల దేవి, పంచాయతీ కార్యదర్శి చింతల ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ పథకాలతో పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చలమల సంధ్య, వార్డు సభ్యులు, లబ్ధిదారులు మిట్టపల్లి శిరీష, ధారావత్ స్రవంతి, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.