UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యాసదస్సును జయప్రదం చేయండి:అశ్వాపురం మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ చంద్రు

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు (విద్యా సదస్సును) జయప్రదం చేయండి. ప్రాథమిక పాఠశాల చవిటిగూడెంలో తెలంగాణ టిఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర విస్తృత సమావేశాలు మరియు విద్యా సదస్సు గోడపత్రిక ను టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి రాము,అశ్వాపురం మండల అధ్యక్షులు కారం సీతారామయ్య,ప్రధాన కార్యదర్శి ఈ.చందు, ఉపాధ్యక్షులు జి.సునీత ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బి.రాము మాట్లాడుతూ…విద్యా సదస్సులో తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల పై చర్చ, పరిష్కార మార్గాలపై లోతైనవిస్తృత చర్చ, తీర్మానాలు ఉంటాయని అన్నారు.ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, సమస్యల పరిష్కారం కు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళనున్నామని తెలిపారు.పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వం పి.ఆర్సి .నివేదికను వెంటనే తెప్పించుకుని తాత్సారం చేయకుండా అమలు చేయాలన్నారు. వాస్తవానికి పి.ఆర్సి. అమలు కాలం ముగిసిపోయి రెండు సంవత్సరాలయింది. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి మినాయింపును పొందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ,ఉపాధ్యాయుల పెండింగ్ బకాయి లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కావున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో ఈ రాష్ట్ర విద్యా సదస్సు నందు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల అధ్యక్షులు కారం సీతారామయ్య,ప్రధాన కార్యదర్శి. ఈ. చందు, ఉపాధ్యక్షులు జి.సునీత, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest