UPDATES  

NEWS

 చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూలపోచారంలో మంగళవారం చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రు కుమారులు బి.వీరన్న,బి.రవి తమ తండ్రి చంద్రు జ్ఞాపకార్థం పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు సామగ్రిని విద్యార్థులకు అందించారు. హెచ్ ఎం జి.నాగరాజు మాట్లాడుతూ..నాలుగేళ్లుగా సుమారు 300 మంది గిరిజన విద్యార్థులకు సామాగ్రి అందించడం అభినందనీయమన్నారు.బి.రవి మాట్లాడుతూ..మార్చి 14 నుంచి జరిగే వార్షిక పరీక్షలకు భయం లేకుండా సిద్ధం కావాలని సూచించారు.ఈ సందర్భంగా బి.శారదా బాయి ఎస్జిటి విద్యార్థులకు వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో డిఎస్.నాగేశ్వర రావు,డిప్యూటీ వార్డెన్ బి.రవి,బి.శోభన్,బి.సింగ్యా,వి.రమేష్, కె.శ్యామల,ఉషశ్రీ,బి.శారదాబాయి,ఎం.చందర్రావు, పి.శ్రీనివాస్, హరియానాయక్,సౌందర్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest