UPDATES  

NEWS

భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు. రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ హర్ష టౌన్షిప్‌లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్‌ లకు ఘన సన్మానం

 గణనాథులను తరలించడంలో చిన్నారులు……

ప్రమాదకరమని తెలిసినా ఎలా పంపిస్తారు

ధర్మారం: ఆగస్టు 27 (తెలంగాణ వాణి విలేకరి)

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి విగ్రహాలను ధర్మారం మండల కేంద్రం నుండి ఆయా గ్రామాలకు తరలించే క్రమములో ట్రాక్టర్లు, టాటా ఏసీలు, ఆటోలలో 7,8 సంవత్సరాల వయస్సున్న బాలలు పాల్గొని ఘననాధులను తరలిస్తున్నారు. ఇందులో పిల్లలు పాల్గొనడం ఎంత ప్రమాదకరమో తల్లిదండ్రులు గమనించాలి. ప్రతి గణపతి తరలింపులో పదేళ్లు కూడా నిండని పిల్లలు ఇలలు ఊదుతూ, కేరింతలు కొడుతూ దప్పు చప్పులతో తరలిస్తున్నారు. ఒక్కో సందర్భంలో ట్రాక్టర్ కు ఎదురుగా ఏదైనా సడన్ గా వస్తే ఆ క్రమంలో స్పీడ్ బ్రేక్ వేస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించి పిల్లలను గణనాధులను తరలించేందుకు పంపకూడదని వారంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest