UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 పెద్దచింతకుంట గ్రామంలో ఇంటింటికి సీఐటీయూ

రాష్ట్ర మహాసభలకు విరాళాల సేకరించిన ఆహ్వాన సంఘం వైస్ చైర్మన్ ఎం. అడివయ్య

నర్సాపూర్/ పెద్ద చింతకుంట (తెలంగాణ వావాణి ప్రతినిధి) కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు జయప్రదం చేయడం కోసం కార్మికులు, ప్రజలు విరాళాలు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం వైస్ చైర్మన్ ఎం. అడివయ్య పిలుపునిచ్చారు. మెదక్ పట్టణ కేంద్రంలో డిసెంబర్ 7,8,9 మహాసభలు నిర్వహిస్తున్నామని, మహాసభలా నిర్వహణ కోసం ఆదివారం నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గ్రామంలో ఇంటింటికి విరాళాలు సేకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సీఐటీయూ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు మెదక్ జిల్లాలో తొలి సారిగా నిర్వహిస్తున్నామని తెలిపారు.జిల్లాలో సంగటిత, అసంగటిత రంగ కార్మికుల సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. స్కీమ్ వర్కర్లతో ప్రభుత్వాలు వెట్టిచకిరి చేయిస్తున్నాయని అన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికుల శ్రమను యాజమాన్యలు దోచుకుంటున్నాయని అన్నారు.ఆటో, హామాలి, భవన నిర్మాణ కార్మికులకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు.ఈ మహాసభలలో కార్మికుల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. జిల్లాలోని కార్మికులు, ప్రజలు విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest