UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 ఉత్కంఠకు తేర

ఉపసర్పంచ్ గా ఎలిగేటి మల్లేశం

ధర్మారం (తెలంగాణ వాణి)

ఎంతో ఉత్కంఠత నెలకొన్న ధర్మారం గ్రామ ఉపసర్పంచ్ పదవికి నేటితో తెరపడింది. ఈనెల 14న సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నిక జరుగగా ధర్మారం సర్పంచిగా దాగేటి రాజేశ్వరి విజయం సాధించారు. ఉప సర్పంచ్ స్థానానికి పలువురు పోటీ పడటంతో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆదేశాల మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఐ ప్రవీణ్ కుమార్, మండల పంచాయతీ అధికారి కె రమేష్ ఆధ్వర్యంలో గురువారం ధర్మారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సమావేశమై సర్పంచ్ తో పాటు 8 మంది వార్డు సభ్యుల ఏకాభిప్రాయం మేరకు ధర్మారం ఉప సర్పంచ్ గా ఎలిగేటి మల్లేశం ఎన్నికైనట్లు ఎంపీడీవో ఐ ప్రవీణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. దింతో నాలుగు రోజులుగా ఉప సర్పంచ్ పదవి ఎవరికి దక్కుతుందో నన్న ఉత్కంఠతకు నేటితో తెరపడింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest