UPDATES  

NEWS

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్

 ఉత్కంఠకు తేర

ఉపసర్పంచ్ గా ఎలిగేటి మల్లేశం

ధర్మారం (తెలంగాణ వాణి)

ఎంతో ఉత్కంఠత నెలకొన్న ధర్మారం గ్రామ ఉపసర్పంచ్ పదవికి నేటితో తెరపడింది. ఈనెల 14న సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నిక జరుగగా ధర్మారం సర్పంచిగా దాగేటి రాజేశ్వరి విజయం సాధించారు. ఉప సర్పంచ్ స్థానానికి పలువురు పోటీ పడటంతో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆదేశాల మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఐ ప్రవీణ్ కుమార్, మండల పంచాయతీ అధికారి కె రమేష్ ఆధ్వర్యంలో గురువారం ధర్మారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సమావేశమై సర్పంచ్ తో పాటు 8 మంది వార్డు సభ్యుల ఏకాభిప్రాయం మేరకు ధర్మారం ఉప సర్పంచ్ గా ఎలిగేటి మల్లేశం ఎన్నికైనట్లు ఎంపీడీవో ఐ ప్రవీణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. దింతో నాలుగు రోజులుగా ఉప సర్పంచ్ పదవి ఎవరికి దక్కుతుందో నన్న ఉత్కంఠతకు నేటితో తెరపడింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest