UPDATES  

NEWS

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్

 స్థానికంలో విజయ డంకా మోగించాలి : బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జుల వేణు గోపాల్ రెడ్డి

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి విజయ డంకా ముగిస్తుందని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ధర్మారం మండల కేంద్రంలో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు తలుపులు బద్దలు కొడతామని ఎంపీపీ జడ్పిటిసి లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రధాని మోడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు దేశవ్యాప్తంగా హర్షిస్తున్నారని తెలిపారు. జెడ్పిటిసి,ఎంపీపీ తో పాటు సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలను అధిక సంఖ్యలో కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల శాఖ అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి అధ్యక్షత వహించగా భాజపా సీనియర్ నాయకులు మేడ వేణి శ్రీనివాస్, సంధినేని లక్ష్మణ్, గోనె సాయి, వేల్పుల తిరుపతి, దేవి కొమురేష్, కొలిపాక మణికంఠ, మామిడి చెందు, కర్రె లక్ష్మణ్, జంగిలి రాజయ్య, రేండ్ల శ్రీనివాస్, పల్లె లక్ష్మణ్, దేవి రజనీకాంత్, గుమ్ముల తిరుపతి, బత్తుల కుమార్, కాల్వ కుమార్ రాజు, దంత రాజన్న అత్తిరి పత్తిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest