UPDATES  

NEWS

ఘోర రోడ్డు ప్రమాదం RTC బస్సు బోల్తా మల్యాల వరద కాలువలో కారు పడిపోవడంతో బీఆర్ఎస్ నాయకుడు తిర్మణి రమణ మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి వేములవాడ మున్సిపల్ నూతన పాలకవర్గానికి విప్ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు కార్పొరేటర్ బత్తుల మధుచంద్ ను ఘనంగా సన్మానించిన మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షులు వాసుమల్ల.గౌతమ్,తమ్మిశెట్టి ప్రసాద్,సాయి తేజ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న బండపల్లి సర్పంచ్ ప్రజలకు అప్రమత్తత సూచనలు కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకున్న బిజెపి నిజామాబాద్ మేయర్ గా కూరగాయల ఉమారాణి గెలుపు దిశగా “పల్లపోతు”

 ఘోర రోడ్డు ప్రమాదం RTC బస్సు బోల్తా

వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

 

ఉట్నూర్ (తెలంగాణ వాణి) ఉట్నూర్ మండల షాంపుర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను 108 అంబులెన్స్ ద్వారా ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. అందులో కండక్టర్ తోపాటు పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు సమయానికి స్పందించడంతో క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. క్షత గాత్రులను స్థానిక ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండటం, ఇరుకైన వంతెన కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

ఈ ప్రమాదంపై మంత్రులు పొన్నం , జూపల్లి కృష్ణారావు లు స్పందించారు. ఈ ఘటనపై రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆదిలాబాద్ ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు గల కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు. ఇరుకైన శ్యామ్‌పూర్ బ్రిడ్జిపై ప్రొటెక్షన్ వాల్ లేకపోవడంతో ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని మంత్రులకు తెలిపారు అదికారులు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest