UPDATES  

NEWS

 తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు

కరీంనగర్ (తెలంగాణ వాణి)

కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం లేనప్పటికి అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమాయ్యారు. కాగా ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.2 నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో పలు మండలాల్లో భూమి కంపించిన సీసీ టీవీ ఫుటేజ్ లు సామాజిక మధ్యామాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ భూప్రకంపనలు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల సుల్తానాబాద్ లో వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, జన్నారంలో కూడా భూమి కనిపించినట్లు తెలుస్తోంది. భూమి ఒక్కసారిగా ప్రకంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటికి పరుగులు తీశారు. అయితే ఆస్థి, ప్రాణ నష్టం లాంటి సంఘటనలు జరగలేదు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest