UPDATES  

NEWS

 సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులు

ధర్మారం (తెలంగాణ వాణి)

ధర్మారం మండల కేంద్రంలోని శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులందరు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆదివారం ఉదయం మండల కేంద్రంలోని శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో గొల్లవాడ, రామాలయం సమీపంలో ఉన్న గణపతి మండపాల వద్ద నిర్వహించే లక్కీ డ్రా తీయడానికి మంత్రిని ఆహ్వానించగా మంత్రి స్పందిస్తూ తప్పకుండా హాజరవుతానని తెలిపినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest