UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 ఘనంగా కొమురం భీమ్ జయంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ పత్తిపాక వారి ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ ఉపాధ్యక్షులు వేగోళం రిషి మాట్లాడుతూ.. భారత స్వతంత్ర ఉద్యమంలో గిరిజనుల పోరాటాల స్థానం ఎంతో కీలకమైనదని ఆదివాసీల ఉత్కంఠ ప్రగతి కోసం చేసిన పోరాటాలు కొన్ని శతాబ్దాల కాలం గడిచిన అధికారిక చరిత్రలో చోటు పొందలేకపోయాయని అన్నారు. తెలంగాణలో కొమరం భీం జీవితం అతనితత్వం ఆయన నినాదం ఈ గిరిజనుల పోరాటానికి శాశ్వత చిహ్నం నిలిచిందని ఆయన మాటల్లో జల్,జంగిల్, జమీన్ అనే మాటలు గిరిజనుల హక్కుల స్వాభిమానాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. 1991 అక్టోబర్ 22న అదిలాబాద్ జిల్లా ప్రస్తుత కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సంకేపల్లి గ్రామంలో గొండు తెగకు చెందిన తండ్రి కొమరం చిన్ను తల్లి సోంబాయి దంపతులకు కొమురం భీమ్ జన్మించాడని అతని బాల్యం పేదరిక సామాజిక అన్యాయంతో నిండిదనితన కుటుంబం ఇతర గిరిజనులు నిరంతర అణిచివేతకు గురవుతుండగా భీమ్ ఈ అసహ్యమైన పరిస్థితుల్ని ఎదుర్కొనసాగాడు. నిజాం పాలనలో అడవి అధికారులు జమీందారులు గిరిజనులపై తీవ్ర పీడన కొనసాగించారని అధికారుల వలన తండ్రి మరణం భీమ మనసులో తిరుగుబాటు ఆవేశాన్ని రగిలించి అక్కడి నుండి ఆయన ప్రజా పోరాటం ప్రారంభమైందని వివరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ బద్దం రవీందర్, అన్నాడ మైపాల్, వెంకటేష్, కొమురయ్య, ఎల్లయ్య, మహేందర్, వంశీ రెడ్డి, మధు చారి, శంకర్ కీర్తన్ యువశక్తి యూత్ ప్రధాన కార్యదర్శి రాకేష్, నితిన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest