UPDATES  

NEWS

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్

 సర్పంచ్ గా భాద్యతలు చేపట్టిన ప్రేమేందర్

లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) సర్పంచిగా హమాలీ కాలనీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని నూతన సర్పంచ్ గా భాద్యతలు చేపట్టిన సర్పంచ్ గుగులోత్ ప్రేమేందర్ అన్నారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో భాద్యతలు చేపట్టిన సందర్భంగా సర్పంచ్ ప్రేమేందర్ మాట్లాడుతూ హమాలీ కాలనీ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా పాలకవర్గం సహకారంతో కలిసి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేలా చూస్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సహకారంతో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పూర్తి చేసి గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని సర్పంచ్ ప్రేమేందర్ అన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు తనతో కలిసి రావలసిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు సర్పంచ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తాళ్లపల్లి రాజు, వార్డు సభ్యులు కాట యాకయ్య, షేక్ రజియా, వర్సా రమణ,పునం వినోద, చింత లక్ష్మినారాయణ, తూర్పాటి కవిత, పంచాయతీ కార్యదర్శి భవాని, నాయకులు జ్యోతి బసు, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest