UPDATES  

NEWS

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్

 ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో

చాతకొండ సర్పంచ్ అభ్యర్థిగా వజ్జా ఈశ్వరి

లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మిదేవిపల్లి మండలం, చాతకొండ గ్రామానికి చెందిన వజ్జా ఈశ్వరి ఆశ కార్యకర్త ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలిచింది. ఉమ్మడి చాతకొండ పంచాయతీ మొట్టమొదటి సర్పంచ్ గా పనిచేసిన స్వర్గీయ మాజీ సర్పంచ్ వజ్జా సీతారాములు భార్య గా అందరికి సుపరిచితురాలైన వజ్జా ఈశ్వరి భర్త బాటలో ప్రజా సేవ చేసేందుకు పంచాయతీ బరిలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తగా ఉంటూ ఎంతో మందికి సేవలందించానని, కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఆశీస్సులతో సిపిఐ పార్టీ బలపరిచిన తనను సర్పంచ్ గా గెలిపిస్తే ప్రజలకు మరిన్ని సేవలందిస్తానని, గ్రామ పంచాయతీలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడమే కాక అందరికి అందుబాటులో ఉంటానని ఈ సందర్బంగా ఆమె తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest