UPDATES  

NEWS

ఈరోజు నుండి ఆరుద్ర కార్తె ప్రారంభం

తొలకరి చినుకు.. ఆరుద్ర మెరుపు తెలంగాణ వాణి : 22 _ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే.వాతావరణం చల్లబడి,తొలకరి జల్లులు కురియగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి.వర్షాలు కురుస్తుండటంతో ఈ మృగశిర కార్తెలోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తుంటాయి.రైతులకు ఆనందం కలిగిస్తుంటాయి.అన్నదాతలకు మేలు చేసే ఈ పర్యావరణ నేస్తాలు…_ _ఇప్పటి తరానికి ఇవేవో తెలియదు.. కానీ పల్లెటూళ్లో ఉండే పెద్దవారికి ఓ 30 ఏళ్లు పైబడిన […]

వర్కర్స్ కు గొడుగులు పంపిణీ చేసిన రిటైర్ సీనియర్ అసిస్టెంట్‌ చింత గణేష్

హైదరాబాద్: ఇఎఫ్ఎల్యూ (ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)లో 32 సంవత్సరాలు సేవలందించి సీనియర్ అసిస్టెంట్‌గా రిటైర్ అయిన చింత గణేష్ శుక్రవారం యూనివర్సిటీలో పనిచేస్తున్న వర్కర్స్‌కు గొడుగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో గార్డెనింగ్, ఆఫీస్ తదితర విధులు నిర్వహించే ఉద్యోగులు వర్షం నుంచి రక్షణ పొందేందుకు గొడుగులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ఆయన చూపిన చొరవను సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశ బేగం, నర్సమ్మ, శ్రవణ్‌కుమార్, శ్రీనివాస్, […]

ఖమ్మం గుమ్మంలో దొంగల హల్చల్

సినీ ఫక్కిలో సోనోవిజన్ షోరూమ్ ను గుల్ల చేసిన దొంగల ముఠా  పోలీసులు వచ్చేలోపు కారులో పరారు  ఖమ్మం (తెలంగాణ వాణి) ఖమ్మం నగరంలో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. జడ్పీ సెంటర్‌లో ఉన్న సోనోవిజన్ మొబైల్ స్టోర్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు తెల్లవారుఝామున భారీ దోపిడీకి పాల్పడ్డారు. సుమారు రూ.80 లక్షల విలువైన ఖరీదైన సెల్‌ఫోన్లను అపహరించి పరారైనట్లు తెలుస్తుంది. దొంగలు స్టోర్‌లోకి ప్రవేశించిన సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల అలారం మోగడంతో […]

ఏసీబీ అదుపులో సీనియర్ అసిస్టెంట్ రాధిక

అదుపులోకి తీసుకున్న అధికారులు   కరీంనగర్ (తెలంగాణ వాణి) కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రాధిక అక్రమ కమిషన్లు వసూలు చేసిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. కరీంనగర్ జిల్లా సంక్షేమ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న 44 ఏళ్ల మహిళా ఉద్యోగిని రాధికను మంగళవారం మధ్యాహ్నం ఏసీబీ కరీంనగర్ రేంజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కాంట్రాక్టర్ల బిల్లుల […]

తెలంగాణ వాణి కథనానికి స్పందన – జంమ్గి బి లో నాలుగు లారీల జొన్నలు నింపిన అధికారులు సంగారెడ్డి, కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి): సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం ఉదయం తెలంగాణ వాణి పత్రికలో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించారు. కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న జొన్నలను వెంటనే తరలించాలని రైతులు కంగ్టి–పిట్లం ప్రధాన రహదారిపై […]

తడ్కల్ లో జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ధర్నా

తడ్కల్ లో జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ధర్నా కంగ్టి పిట్లం రోడ్డు పై బైఠాయించిన రైతన్నలు,నిలిచిన వాహనాలు   సంగారెడ్డి,కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి ) సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో మంగళవారం జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతన్నలు కంగ్టి పిట్లం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు గోనే సంచుల,లారీల కొరతతో,అకాల వర్షానికి జొన్నలు […]

కొత్తగూడెం క్లబ్‌లో ఈ నెల 8న జరగనున్న “రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్” లాంచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : బీఆర్ఎస్ జిల్లా నాయకులు జయరాం

నిరుద్యోగ యువతకు నాణ్యమైన, ఉచిత పోటీ పరీక్షల శిక్షణ అందించాలనే లక్ష్యంతో కాంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో, Chakravarty E-Classroom భాగస్వామ్యంతో రూపొందించిన “Rakesh Reddy E-Classes App” లాంచ్ కార్యక్రమాన్ని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు జయరామ్ కోరారు.ఈ సందర్భంగా జయరామ్ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగ సాధనకు నాణ్యమైన శిక్షణ, సరైన మార్గదర్శకత్వం ఎంతో అవసరమని అన్నారు. అలాంటి సమయంలో నిరుద్యోగ యువతకు పూర్తిగా […]

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు

జర్నలిస్టులపై ఇంటలిజెన్స్ పోలీసులతో విచారణ జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై మంత్రి పొంగులేటికి ఫిర్యాదు   హైదరాబాద్  (తెలంగాణ వాణి) జర్నలిస్టులపై ఇంటలిజెన్స్ పోలీసులతో విచారణ చేయిస్తున్న జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కలిసి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ నేతృత్వంలో […]

పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ముస్లిం మైనారిటీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పర్హిన్ మేడంను సోమవారం చిన్నారి ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతి హరిత దీక్ష సభ్యుడు ఎం.డి. అఫాన్ జైదీ మర్యాదపూర్వకంగా కలిసి పచ్చని ఔషధ మొక్కలను అందజేశాడు. ఈ సందర్భంగా పర్హిన్ మేడం అఫాన్ జైదీకి ఆశీర్వాదాలు అందిస్తూ, ప్రకృతి పరిరక్షణ కోసం చేస్తున్న సేవలను అభినందించారు.రామవరం ఇఖ్రా ఆధునిక పాఠశాలలో చదువుతున్న అఫాన్ జైదీ, కె.ఎన్. రాజశేఖర్ స్ఫూర్తితో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో […]

సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్ నగర్ కాలనీ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని సిపిఐ సర్పంచ్ జర్పల దేవి, పంచాయతీ కార్యదర్శి చింతల ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ పథకాలతో పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చలమల సంధ్య, వార్డు సభ్యులు, లబ్ధిదారులు మిట్టపల్లి శిరీష, ధారావత్ స్రవంతి, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.