UPDATES  

NEWS

కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్ కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్ క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ రమణ రెడ్డి

పుట్టిన రోజు వేడుకలకు హాజరైన లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ తాటి అనిత తిరుమలేష్ దంపతులు

లక్ష్మిదేవిపల్లి మండలం సంజయ్ నగర్ గ్రామపెద్దలు కుంజ సమ్మయ్య అనసూర్య దంపతుల మనవరాలు,కుంజ నరేష్ విజయ దంపతుల కూతురు తోషిణి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన లక్ష్మిదేవిపల్లి సర్పంచ్ తాటి అనిత తిరుమలేష్ దంపతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పూణెం.శ్రీనివాస్ నాగమణి దంపతులు,జిల్లా ఏఈడబ్ల్యూసీఏ నాయకులు మలకం సాములు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకులు చింత రాములు,కుంజ సమ్మయ్య తదితరులు ఉన్నారు.

మానవత్వం చాటుకున్న ఆటో భాయ్ అవీర్..అభినందించిన ATEC జిల్లా అధ్యక్షులు మాళోత్ బాలు నాయక్ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నటరాజ్ సెంటర్ నందు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ దగ్గర ఓ వ్యక్తి నిద్రపోవడానికి గమనించిన ఆటో డ్రైవర్ అవీర్ .. ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని అతని నిద్ర లేపి.. మీరు అందించి మానవత్వం చాటుకున్నారు. ఆకస్మాత్తుగా వచ్చే వాహనాల నుంచి పెద్ద ప్రమాదం జరిగేదని అతను లేపి పక్కకు పంపి మానవత్వం చాటుకున్న అవీర్ ను ఏటీఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ అభినందించారు. మానవత్వం ఇంకా […]

నర్సంపేట బీసీ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం

విద్యార్థి చేయి విరిగిన ఘటనపై వార్డెన్ గోప్యత.! నర్సంపేట (తెలంగాణ వాణి ప్రతినిది) నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ బీసీ వసతి గృహంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థి చేయి విరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదవ తరగతి విద్యార్థులు కింది తరగతి విద్యార్థులపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ర్యాగింగ్‌కు పాల్పడుతుండటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. గత ఆదివారం పదవ తరగతి విద్యార్థులు జరిపిన దాడిలో తొమ్మిదో తరగతికి చెందిన గణేష్ అనే విద్యార్థి తీవ్రంగా […]

మొదటిసారిగా’ ఓ ‘ పాజిటివ్ రక్త దానం చేసిన అజార్

భద్రాది కొత్తగూడెం జిల్లాలో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓ పాజిటివ్ రక్తం అత్యవసరంగా ఉందని పాల్వంచ నివాసి అజార్ కు తెలపడంతో మొదటిసారి ‘ ఓ’ పాజిటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణదాత అయ్యాడు. ఈ సందర్భంగా రక్తదాతల క్లబ్బు సభ్యులు, స్థానిక సామాజిక కార్యకర్తలు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఎన్నికలు ఏవైనా సిపిఐదే పైచేయి

ప్రజలను మెప్పించేవిధంగా మన పాలన సాగాలి నిస్వార్థమైన సేవ, పారదర్శక పాలన అందించాలి సమస్యల పరిష్కారమే ప్రథమ ఎజెండా ఒంటరి పోరులో అనూహ్య విజయాలు కొందరు మాటలు జారడం మానుకుంటే మంచిది ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు   కొత్తగూడెం (తెలంగాణ వాణి) గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సిపిఐ అజేయ శక్తిగా నిలిచిందని, అవాకులు చెవాకులు పేలిన వారి నోళ్లు ఒక్క సారిగా మూతపడ్డాయని, గెలిచిన సిపిఐ సర్పంచ్లు, వార్డు సభ్యులు నిస్వార్ధంగా, పారదర్శకంగా ప్రజారంజక పాలన అందించాలని […]

ఉత్కంఠకు తేర

ఉపసర్పంచ్ గా ఎలిగేటి మల్లేశం ధర్మారం (తెలంగాణ వాణి) ఎంతో ఉత్కంఠత నెలకొన్న ధర్మారం గ్రామ ఉపసర్పంచ్ పదవికి నేటితో తెరపడింది. ఈనెల 14న సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నిక జరుగగా ధర్మారం సర్పంచిగా దాగేటి రాజేశ్వరి విజయం సాధించారు. ఉప సర్పంచ్ స్థానానికి పలువురు పోటీ పడటంతో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆదేశాల మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఐ ప్రవీణ్ కుమార్, […]

టేకులపల్లి పంచాయతీ ఎన్నికల్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించిన ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని టేకులపల్లి గ్రామ పంచాయతీ బుధవారం మూడో దఫా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టి జి టి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, భద్రాది జిల్లా జిఎల్ ఎస్. జేఏసీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ కుటుంబ సమేతంగా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు ఎంతో విలువైనదని,దేశ పురోగతికి మరియు గ్రామాభివృద్ధికి పంచాయతీ ఎన్నికలు అత్యంత కీలకమైనవని ఈ సందర్భంగా లక్ష్మణ్ నాయక్ తెలిపారు.

ప్రశాంతంగా ముగిసిన తుదివిడత గ్రామపంచాయతీ ఎన్నికలు

భద్రాద్రి జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారం తో ప్రశాంతంగా ముగిశాయి.భద్రాద్రి జిల్లాలో మొత్తం 7 మండలాల్లో పోలింగ్ జరిగిన పోలింగ్ ప్రక్రియలో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉద్యోగులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం..

ఓడినా ప్రజల పక్షమే

గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతాం పుష్పలత తిరుపతి ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) తనపై నమ్మకంతో బ్యాట్ గుర్తుపై ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మేడ వేణి పుష్పలత తిరుపతి కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని ఓడిన తాను తన భర్త ఎల్లవేళలా గ్రామ ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడుతామని వెల్లడించారు. గెలిచిన సర్పంచ్ కు సహకరిస్తూ గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకుంటామని తెలిపారు. ఓటమి […]

దీక్షిత అసోసియేషన్ మేనేజర్ బి.శ్రీనివాస్ కు మొక్కలు వితరణ చేసిన ప్రకృతి ప్రేమికుడు ఏటీఈసీ జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని దీక్షిత అసోసియేషన్ మేనేజర్ బి.శ్రీనివాస్ నివాసంలో మొక్కలను అందించిన ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్. అనంతరం దీక్షిత, రోహిత్ చిన్నారులు మిత్ర బృందం కలిసి మొక్కలు నాటారు. ఇప్పటికీ తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.