UPDATES  

NEWS

దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ ప్రకృతి ప్రేమికుడు శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు కాంపెల్లి కనకేష్ అద్వర్యంలో ఎమ్మెల్సి కవిత ను మర్యాద పూర్వకంగా కలిసిన యువజన నాయకులు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ నివాసానికి విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గజమాలతో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు యువతి యువకులు సీత్లా పండగను ఘనంగా జరుపుకున్నారు ఘనంగా బంజారాల సీత్లా పండగ వికాస తరంగిణి కొత్తగూడెం శాఖ ఆధ్వర్యంలో రేగళ్లలో జూలై 4న ఉచిత క్యాన్సర్ క్యాంప్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది సేవలు భేష్ కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

పుట్టిన రోజు ఓ మొక్కను బహుమతిగా ఇవ్వండి: ప్రకృతి ప్రేమికుడు కళ్యాణ్

పుట్టినరోజు బహుమతిగా మొక్కలు ఇవ్వడం ఒక మంచి ఆలోచన.అవి అందం,ఆరోగ్య ప్రయోజనాలు మరియు పర్యావరణానికి సహాయపడతాయని ప్రకృతి ప్రేమికుడు మొక్కల కళ్యాణ్ పుట్టినరోజు బహుమతిగా ఓ మొక్కను యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత బాలు నాయక్ కు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి రోజు ఓ మొక్కను నాటుతూ యువతకు ఆదర్శంగా ఉన్న కళ్యాణ్ ను బాలు నాయక్ అభినందించారు

యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత యం.బాలు నాయక్ పుట్టిన రోజు మొక్కను నాటిన కె ఎన్ రాజశేఖర్

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకృతి హరిత దీక్ష మరియు గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు, సింగరేణియన్ కె.ఎన్ రాజశేఖర్ ప్రముఖుల పుట్టిన రోజు పెళ్ళి రోజు సందర్భంగా మొక్కలు నాటడం మరియు ప్రతి రోజు ఓ మొక్కను నాటడం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రకృతి హరిత దీక్ష గౌరవ సభ్యులు,యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత,సమాజ సేవకుడు,ప్రకృతి ప్రేమికులు మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఆంగ్ల ఉపాధ్యాయులు బాలు నాయక్ పుట్టినరోజు సందర్భంగా శనివారం […]

పదో తరగతి ఫలితాల్లో రేలకాయలపల్లి ప్రభంజనం..సమిష్టి కృషితోనే 100% ఫలితాలు: హెచ్ ఎం శ్రీనివాసరావు నాయక్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నాడు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు.ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100% ఫలితాలతో విజయకేతనం ఎగురవేశారు. విద్యార్థులు కష్టపడి చదివిన ఫలితం దక్కిందని 100% రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు నాయక్ ఉపాధ్యాయులకు చరవాణి ద్వారా అభినందనలు తెలిపారు.

పదవ తరగతి ఫలితాల్లో పెంకె గీతిక విజయకేతనం….పలువురు అభినందనలు 

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రామవరం ప్రాంతానికి చెందిన పెంకె గీతిక 10వ తరగతి ఫలితాలలో 560 మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేసింది.గీతిక తల్లి ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్,తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్నారు.ఇదే స్ఫూర్తి తో పై చదువులు చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని స్థానిక ప్రజలు పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.

పిల్లలలో మానసిక ధైర్యాన్ని నింపండి:-TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు A.రాంబాబు.

పదవ తరగతి ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిరుత్సహా పడకుండా వారిలో మానసిక ధైర్యాన్ని కల్పించాలని TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు ఆంగోతు రాంబాబు అన్నారు .ప్రతిభకు మార్కులకు సంబంధం లేదన్నారు. విద్యార్థులు ఫలితాలు ఎలా ఉన్నా ఆందోళన చెందకూడదానీ, ఇది జీవితంలో తొలి అడుగు మాత్రమేనని చెప్పారు.

పద్మశ్రీ వనజీవి రామయ్య అవార్డు అందుకున్న ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహన్.

పద్మశ్రీ వనజీవి రామయ్య అవార్డు అందుకున్న ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహన్.అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ వెలుగుమట్ల పార్కు లో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వారసురాలు శాంతాబాయి తో కలిసి మామిడి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొక్కల వెంకటయ్య తదితరులు  పాల్గొన్నారు

ఉగ్ర దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తో మొక్కను నాటిన మొక్కల రాజశేఖర్ 

కాశ్మీర్ పహల్గావులో జరిగినటువంటి ఉగ్ర దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలుపుతూ వారందరి ఘన నివాళులు అర్పిస్తూ పచ్చని మొక్కను నాటిన తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకృతి హరిత దీక్ష మరియు గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు సింగరేణియన్ కె.ఎన్.రాజశేఖర్.కాశ్మీర్ లో ఉగ్రవాద దాడి హేయమైన చర్య అని ఆయన అన్నారు.

తెలంగాణ వాణి జర్నలిస్ట్ కు రాష్ట్రస్థాయి గౌరవం

మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు – 2025 అందుకున్న పిల్లి రవికిరణ్, మహమ్మద్ ఖాసీం, క్రాంతి కుమార్ మంచిర్యాల (తెలంగాణవాణి జిల్లా ప్రతినిధి) మంచిర్యాల జిల్లా జర్నలిస్టులు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆదివారం రాజమండ్రిలో అభిలాష హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు కార్యక్రమంలో ఉత్తమ జర్నలిస్టుల విభాగంలో రామకృష్ణాపూర్‌కు చెందిన తెలంగాణవాణి జర్నలిస్ట్ పిల్లి రవికిరణ్ తో పాటుగా మందమర్రి ప్రాంతానికి చెందిన మహమ్మద్ […]

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి కాలరీస్ డిస్టిక్ అసోసియేషన్ కొవ్వొత్తుల ర్యాలీ

కాశ్మీర్ పహల్గావులో జరిగినటువంటి ఉగ్ర దాడిలో మరణించిన వారికి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి కాలరీస్ డిస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో శాంతి ర్యాలీని నిర్వహించి అమర వీరుల స్థూపం వద్ద నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా డి వై పి.ఎం మరియు సింగరేణి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కమిషనర్ బి.సుశీల్,పి ఎం కే వరప్రసాద్, మరియు 40 మందికి పైగా రోవర్ స్కౌట్ లీడర్స్,స్కౌట్ మాస్టర్లు,స్కౌట్స్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు కె ఎన్ రాజశేఖర్ స్పూర్తితో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న శనగ కళ్యాణ్

చదివింది బీటెక్ చేసేది ప్రకృతి సేవ.. చదివే కాదు సేవలలో కూడా ముందుంటానని నిరూపించాడు కల్యాణ్ ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు కె ఎన్ రాజశేఖర్ స్పూర్తితో ప్రతి రోజు ఓ మొక్కను నాటుతున్నరాయన.ఈ నేపద్యంలో ప్రకృతి హరిత దీక్ష తీసుకొని 50 వ రోజున మరియు వివాహ వివహ వార్షికోత్సవం సందర్భంగా కొబ్బరి మొక్కను నాటిన ప్రకృతి ప్రేమికులు శనగ కళ్యాణ్ మణి దంపతులు. వాతావరణ సూచనలు మొక్కలు నడుపుతున్న కళ్యాణ్ దంపతులకు,ప్రకృతి మాత ఆశీర్వాదం […]