సాంబమూర్తి దేవాలయ అభివృద్ధి కమిటీ ఏకగ్రీవం ధర్మారం (తెలంగాణ వాణి ) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి గ్రామంలో ఉన్న సాంబమూర్తి దేవాలయ అభివృద్ధి కమిటీ ని ఆదివారం స్థానిక సర్పంచ్ సూర రజిత వెంకటేశం ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక సమావేశమై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్ గా కోలా వెంకటేశం, వైస్ చైర్మన్ గా పెరిక మహేష్, ప్రధాన కార్యదర్శిగా బైరి మహేష్, కోశాధికారిగా మోర గణపతి, చింతల సూర్య ప్రకాష్, ప్రచార […]
లక్ష్మీదేవిపల్లిలో వీధి దీపాల ఏర్పాట్లు వేగవంతం: సర్పంచ్ తాటి అనిత
లక్ష్మీదేవి పల్లి మండలంలో నూతన పాలకవర్గం అభివృద్ధి పనుల్లో వడివడిగా ముందుకు సాగుతోంది.ఈ క్రమంలో లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ తాటి అనిత పర్యవేక్షణలో ప్రకృతి వనం సమీపంలోని చాతకొండ రోడ్డుపై నూతన వీధి దీపాల ఏర్పాటు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.పాదచారులు,వాహన దారులకు రాత్రివేళల్లో ఇబ్బందులు లేకుండా శాశ్వత విధి దీపాలను ఏర్పాటు చేయడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్ను అభినందిస్తున్నారు.ఈ పనులకు సహకారం అందించిన సంజయ్ నగర్ సర్పంచ్ తాటి బాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.
56వ డివిజన్లో మెగా మెడికల్ క్యాంపు..ఉచిత మందుల పంపిణీ
కొత్తగూడెం కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటరమణ ఆయుర్వేదిక్ హాస్పిటల్ లో ఆదివారం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ రాయపాటి మానస, డాక్టర్ వేణు ఆహ్వానం మేరకు కొత్తగూడెం కార్పొరేషన్ 56వ డివిజన్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ 24వ వార్డు కౌన్సిలర్ బాలశెట్టి సత్యభామ క్యాంపును సందర్శించారు. వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను ఆమె సన్మానించారు.ఈ సందర్భంగా […]
హమాలికాలనీ గ్రామంలో కొత్త కరెంటు పోల్స్పై వీధి దీపాల ఏర్పాటు లక్ష్మీదేవిపల్లి
లక్ష్మీదేవిపల్లిమండలం హమాలికాలనీ గ్రామపంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన కరెంటు పోల్స్పై వీధి దీపాలను అమర్చే పనులు కొనసాగుతున్నాయని సర్పంచ్ గుగులోత్ ప్రేమిందర్ నాయక్ తెలిపారు.గ్రామంలోని అన్ని వీధుల్లో పూర్తి స్థాయిలో వెలుగును నింపేలా వీధిలైట్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి రాజు,వార్డు సభ్యులు మరియు పంచాయతీ సెక్రటరీ పాల్గొన్నారు.గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.
బాలమేళాలో రాజాపురం పాఠశాల విద్యార్థుల ప్రతిభ
రాజాపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమూహ స్థాయి బాలమేళాలో అద్భుత ప్రతిభ కనబరిచి మూడు బహుమతులు సాధించారు.వి.విరుక్ష (మొదటి తరగతి) మొదటి బహుమతి,కె. స్మైలిక (ఐదవ తరగతి) మొదటి బహుమతి, వి. మనన్య రామ్ (రెండవ తరగతి) రెండవ బహుమతి సాధించి పాఠశాలకు గౌరవం తీసుకొచ్చారు. ఉపాధ్యాయులు రాంప్రసాద్,రాంబాబు సమర్థ మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పాఠశాల వర్గాలు తెలిపారు. విశేష కృషి చేసిన విద్యార్థులను గ్రామ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, పంచాయతీ […]
ఖమ్మంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఘనంగా సైన్స్ దినోత్సవం
స్థానిక ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో సర్ సి.వి. రామన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు,మోడళ్లను ప్రదర్శించి తమ సృజనాత్మకతను చాటుకున్నారు. శాస్త్ర విజ్ఞానం నిత్య జీవితంలో ఎంతో ఉపయోగ పడుతుందని ఉపాధ్యాయులు వివరించారు.సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య,డీజీఎం చేతన్ మాధుర్,ప్రిన్సిపాల్ నివేదిత,వైస్ ప్రిన్సిపాల్ యాచమనేని […]
ప్రజా సమస్యల పై ప్రత్యేక దృష్టి..సర్పంచ్ అజ్మీర లైలా
లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అజ్మీర లైలా గ్రామంలోని వీధి వీధి తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు.తాగునీరు, డ్రైనేజీ,విద్యుత్, రహదారుల వంటి సమస్యలపై స్థానికులతో మాట్లాడి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని చరవాణి ద్వారా సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రజలతో నేరుగా మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలక వర్గం సభ్యులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు
గిరిజన బాలలాజీ స్వామివారి కళ్యాణంకు హాజరైన:గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. హాథీరామ్ నాయక్
గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని సంపత్ నగర్లో గిరిజన బాలలాజీ స్వామివారి ఆలయంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు కొండపల్లి గోపాలకిషన్, రజిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు అక్కినపల్లి సోమాచార్యులు, యజ్ఞికులు రంగం అజయ్ కుమార్, సాయి చక్రి చార్యులు స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఇస్లావత్ బాలు బృందం సమన్వయం చేశారు. ఈ వేడుకలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. హాథీరామ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.స్వామివారి […]
మండల స్థాయి బాల్ మేళా 2.0 ఘన విజయవంతం, అభినందించిన ఎంఇఓ సూరయ్య
స్థానిక చంద్రుగొండ మండల పరిధిలోని మూడు కాంప్లెక్స్ల పరిధిలో చంద్రుగొండ రేపల్లెవాడ, పోకులగూడెం కేంద్రాల్లో బాల మేళా 2.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి సురయ్య, చంద్రుగొండ కాంప్లెక్స్ హెచ్ఎం ఉప్పల్ రెడ్డి,రేపల్లెవాడ కాంప్లెక్స్ హెచ్ఎం రామచందర్ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా జరిగింది.లైబ్రరీ, స్టోరీ టెల్లింగ్ విభాగాల్లో ప్రతి తరగతి నుంచి ఒక్కో విద్యార్థిని ఎంపిక చేసి మండల స్థాయికి పంపించారు. మూడు సబ్జెక్టుల్లో నిర్వహించిన పరీక్షల్లో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు గోల్డ్ […]
కాకతీయ కాలంనాటి శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గుడిపాడు రామచంద్రాపురం గ్రామంలోని కాకతీయ కాలంనాటి శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది.శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ ఎన్. సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జీఎల్ఎస్–జేఏసీ భద్రాద్రి జిల్లా కమిటీ హాజరై స్వామిని దర్శించుకుంది.ముఖ్య అతిథులుగా శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి తురాజ్ రాజాజీ, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, జీఎల్ఎస్–జేఏసీ చైర్మన్ […]