నిజామాబాద్ జూన్ 11
(తెలంగాణ వాణి ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన సిబ్బందినీ బుధవారం నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు.గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన ఏ ఎస్సైలకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు.పదోన్నతి పొందిన వారిలో2వ టౌన్ పోలీస్ స్టేషన్ లో డి. మోహన్, ఏ ఎస్సైగా పదోన్నతి, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఎం. గంగాధర్ గౌడ్, ఏ ఎస్సై గా, ఎం. సత్తయ్యను ఏ ఎస్సైగా వర్ని పోలీస్ స్టేషన్, టి. రవీందర్ ను మహిళా పీ ఎస్ లో ఏ ఎస్సైగా పదోన్నతి పొందారు.
Post Views: 52