UPDATES  

 ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి

ధర్మారం (తెలంగాణ వాణి) మంగళవారం సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అనగారిన వర్గాల, శ్రమజీవుల కష్టాన్ని దోచుకునే వారినిఎదిరించి పోరాడి సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపించిన మహనీయుడని కొనియాడారు. చైతన్యానికి స్ఫూర్తి నిచ్చిన పోరాట యోధుని గాధలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తోడేటి తిరుపతి, పాలకుర్తి రాజేశం, ఎరుకల ఎల్లయ్య, బొమ్మగాని అంజన్న, తోడేటి మోహన్, తోడేటి మల్లేశం, గుర్రం సత్యనారాయణ,పెరుమాండ్ల ప్రసాద్, పాలకుర్తి సాయి, గుర్రం రవి, నాడెం రామస్వామి, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest