UPDATES  

 హర్ ఘర్ తిరంగ యాత్రను విజయవంతం చేయండి

ధర్మారం (తెలంగాణ వాణి )పంద్రా ఆగస్టు రోజున ధర్మారం మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగ యాత్ర లో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించాలని మండల ముఖ్య కార్యకర్తల సమావేషంలో బిజెపి మండల ఇంచార్జి కొమ్ము రాంబాబు కార్య కర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం మండలకేంద్రంలోని వైశ్య భవన్ లో మండల శాఖ అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి అయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల అధ్యక్షులను బలోపేతం చేయడమే లక్ష్యంగా బిజెపి ముందడుగు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీనివాస్,సందనవేణి లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి దేవి రాజలింగు, గోనే సాయి, మండల వైస్ ప్రెసిడెంట్ దేవి కొమరేష్, సామంతుల కిరణ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు మామిడి చెందు, మాజీ యూత్ మండల అధ్యక్షుడు కొలిపాక మణికంఠ, కేశినేని నాగరాజు, పల్లె లక్ష్మణ్, సాగంటి నరసయ్య, పాలమాకుల కర్ణాకర్ రెడ్డి, వన్నెల బాల్రెడ్డి, కోమటిరెడ్డి బాపురెడ్డి, మేడ వేణి మహేష్, రమేష్, నాడెం మల్లేశం, పులిపాక మహేష్, మేడి రమేష్, శాఖ పురం వెంకటేష్, రేండ్ల శ్రీనివాస్ చెల్లెలి సతీష్ కుమార్, ఎత్తరి గణేష్,కోటగిరి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest