ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ బస్టాండ్ సమీపలో మంగళవారం రాత్రి 10 గంటలకు లారీ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాలీలా ఉన్నాయి. మంగళవారం రాత్రి 10 గంటలకు మంచిర్యాల వైపునుండి కరీంనగర్ వైపు లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులోకి వెల్లడంతో లారీ రైట్ సైడ్ రోడ్డు కిందకు వెళ్ళుతున్న క్రమంలో తెరుకున్న డ్రైవర్ వెంటనే లారిని రోడ్డు ఎక్కించే ప్రయత్నంలో లారీ బోల్తా పడిందని చెపుతున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరుగలేదని స్థానికులు తెలిపారు. బుధవారం బోల్తా పడ్డ లారిని క్రెన్ సహాయతో లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు.
Post Views: 350

