పాల్వంచ, మార్చి 08: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పాల్వంచ మండల కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల ఉపాధ్యక్షులు పీ. సత్యశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గా భవాని ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా సాధికారతపై ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాజు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి. మురళీమోహన్, మల్లెంపాటి వెంకటేశ్వర్లు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి పద్మలత, జిల్లా కార్యదర్శి పాషా పాల్గొన్నారు.సామాజిక మాధ్యమ సభ్యులు మంగీలాల్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు, హరి సింగ్, మహిళా కన్వీనర్ సువర్చల, కార్యదర్శులు సుధారాణి, యశోద, రాజులు, అంబ్రిక, వెంకన్న హాజరయ్యారు. మహిళా కమిటీ సభ్యులు హబీబున్నిస, నాగమణి, శ్రీచిద్వి, వరలక్ష్మి, శ్యామల, అస్మ, క్రాంతికుమారి పాల్గొన్నారు.సభ్యులు లీలా మాధురి, లక్ష్మీ, పద్మజ, స్వాతి, కోటమ్మ, మణి, పద్మావతి, మాధవి, కవిత, ఉషారాణి, రాధ, మౌలబి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
