UPDATES  

NEWS

కాకతీయ కాలంనాటి శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట అలాంటి ఉపాధ్యాయులను తొలగించాల్సిందే..?? CM రేవంత్‌కు విద్యా కమిషన్ సూచన.! గిరిజన సంక్షేమ భాషా పండితుల, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ చేయాలి: టిపిటిఎఫ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం విజయవంతం చేయాలి: జిల్లా కార్యదర్శి ఎస్.శైలజ మైనర్,మానసిక రోగి పై అత్యాచారం, వ్యక్తికి 20 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి ఆహ్వానం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) లీగల్,హ్యూమన్ రైట్స్ & ఆర్‌టీఐ విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా అడ్వకేట్ మారపాక రమేష్ కుమార్ నియామకం ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ.జయంతి కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ అండ్ బి ఆర్ ఎస్ నాయకులు ధర్మపురి సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కేటాయించాలి

 అలాంటి ఉపాధ్యాయులను తొలగించాల్సిందే..?? CM రేవంత్‌కు విద్యా కమిషన్ సూచన.!

తెలంగాణ సర్కార్‌కు విద్యా కమిషనర్ కీలక సూచనలు చేసింది. ఉపాధ్యాయుల ఆటోమేటిక్ పదోన్నతులు రద్దుకు సూచనలు చేసింది. పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని పేర్కొంది.దాంతో పాటు ఐదేళ్లకోసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా తప్పనిసరి అని స్పష్టం చేసింది. రెండేళ్లలో మెరుగుపడకపోతే ఏకంగా సర్వీసు నుంచి తొలగించాలని సూచించింది. ఇకపై నియమించే ఉపాధ్యాయులకూ కొత్త నిబంధనలు సూచించింది.నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేసింది.డీఈఐఈడీ కోర్సు రద్దు చేయాలని తెలిపింది.మరోవైపు..విద్యావ్యవస్థలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లోని 100 మండలాల్లో 200 పాఠశాలలను అత్యున్నత ప్రమాణాలతో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’గా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని బృందం సమర్పించిన ‘తెలంగాణ విద్యా విధానం 2026: సమగ్ర విద్యా దృక్పథం’ నివేదికపై చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest