UPDATES  

NEWS

చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి

 అలాంటి ఉపాధ్యాయులను తొలగించాల్సిందే..?? CM రేవంత్‌కు విద్యా కమిషన్ సూచన.!

తెలంగాణ సర్కార్‌కు విద్యా కమిషనర్ కీలక సూచనలు చేసింది. ఉపాధ్యాయుల ఆటోమేటిక్ పదోన్నతులు రద్దుకు సూచనలు చేసింది. పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని పేర్కొంది.దాంతో పాటు ఐదేళ్లకోసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా తప్పనిసరి అని స్పష్టం చేసింది. రెండేళ్లలో మెరుగుపడకపోతే ఏకంగా సర్వీసు నుంచి తొలగించాలని సూచించింది. ఇకపై నియమించే ఉపాధ్యాయులకూ కొత్త నిబంధనలు సూచించింది.నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేసింది.డీఈఐఈడీ కోర్సు రద్దు చేయాలని తెలిపింది.మరోవైపు..విద్యావ్యవస్థలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లోని 100 మండలాల్లో 200 పాఠశాలలను అత్యున్నత ప్రమాణాలతో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’గా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని బృందం సమర్పించిన ‘తెలంగాణ విద్యా విధానం 2026: సమగ్ర విద్యా దృక్పథం’ నివేదికపై చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

[post_to_image]

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest