UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 నిజామాబాద్ మేయర్ గా కూరగాయల ఉమారాణి

నిజామాబాద్ (తెలంగాణ ప్రతినిధి) నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన 49వ డివిజన్ కార్పొరేటర్ కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ లోని సమావేశం హాల్లో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల కార్పొరేటర్లు చేతులెత్తి ఉమారాణి ని మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం 54 వ డివిజన్ కార్పొరేటర్ సల్మా తహసీన్ లను ఎన్నుకున్నారు. ముందుగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్ల చేత నిజామాబాద్ ఆర్డిఓ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్ ఎన్నిక నిర్వహించారు. కార్పొరేషన్ లోని 14 మంది మజ్లిస్ పార్టీ కార్పోరేటర్ల మద్దతుతో 17 మంది కార్పొరేటర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన ఒకే ఒక కార్పొరేటర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. మేయర్ పిఠానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 33 కాగా రెండు ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకొని మొత్తం 34 మంది సభ్యులైయ్యారు. దీంతో అధికారులు నిజామాబాద్ మేయర్ గా కూరగాయల ఉమారాణి ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు బీజేపీ 28 మంది కార్పొరేటర్లు ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎక్స్ అఫీషియోల సభ్యులతో 31 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సోమవారం ఉదయం గెలుపొందిన కార్పొరేటర్లను క్యాంపుల నుండి ప్రత్యేక బస్సుల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ కు తరలించారు.

Editor Reporter
telanganavanidaily.com

నిజామాబాద్ మేయర్ గా కూరగాయల ఉమారాణి

నిజామాబాద్ (తెలంగాణ ప్రతినిధి) నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన 49వ డివిజన్ కార్పొరేటర్ కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ లోని సమావేశం హాల్లో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల కార్పొరేటర్లు చేతులెత్తి ఉమారాణి ని మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం 54 వ డివిజన్ కార్పొరేటర్ సల్మా తహసీన్ లను ఎన్నుకున్నారు. ముందుగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్ల చేత నిజామాబాద్ ఆర్డిఓ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్ ఎన్నిక నిర్వహించారు. కార్పొరేషన్ లోని 14 మంది మజ్లిస్ పార్టీ కార్పోరేటర్ల మద్దతుతో 17 మంది కార్పొరేటర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన ఒకే ఒక కార్పొరేటర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. మేయర్ పిఠానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 33 కాగా రెండు ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకొని మొత్తం 34 మంది సభ్యులైయ్యారు. దీంతో అధికారులు నిజామాబాద్ మేయర్ గా కూరగాయల ఉమారాణి ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు బీజేపీ 28 మంది కార్పొరేటర్లు ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎక్స్ అఫీషియోల సభ్యులతో 31 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సోమవారం ఉదయం గెలుపొందిన కార్పొరేటర్లను క్యాంపుల నుండి ప్రత్యేక బస్సుల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ కు తరలించారు.

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest