లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) చాతకొండ పంచాయతీలోని బీసీ కాలనీలో ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షులు మహబూబ్ జానీ ఇంట్లో జరిగిన గ్యార్వి షరీఫ్ ఉత్సవాల్లో సిపిఐ నాయకురాలు, చాతకొండ సర్పంచ్ అభ్యర్థి వజ్జా ఈశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం అని, అందరూ సామరస్యంగా జరుపుకునే వేడుక అని అన్నారు. ఎంతో పవిత్రంగా కొలిచే గ్యార్వి షరీఫ్ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో, శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. సర్వ మతాల సారాంశం మానవత్వమేనని, ప్రతి ఒక్కరిలో ఓర్పు, సహనం పెరిగి ఐక్యతగా జీవించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మంద గాబ్రీయేలు (కమలయ్య), సైదులు, రజియా మరియు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 214