UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 గురుకుల విద్యార్థుల అవస్థలు

ఇంకా అందని స్కూల్ యూనిఫామ్స్, కాస్కోటిక్ చార్జీలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల కళాశాలలో చదివే విద్యార్థులకు ప్రతి ఏడాది విద్యాశాఖ 2 జతల యూనిఫాంలు పంపిణీ చేసేది. అయితే ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు కావస్తున్న గురుకుల పాఠశాలల విద్యార్థులకు కొత్త యూనిఫామ్ లు, షూస్, కాస్మోటిక్ చార్జీలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఏ) పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు సుంచు మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. యూనిఫాంల విషయంలో విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి తేటతెల్లమవుతుందని పాత దుస్తులతో విద్యార్థులు కాలం వెళ్ళదిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే విద్యాశాఖ అధికారులు యూనిఫాం లను కుట్టించేందుకు సంబంధిత ఏజెన్సీలకు అందజేస్తే బాగుండేదని అన్నారు. ప్రభుత్వం,విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా మేల్కొని విద్యార్థులకు సకాలంలో యూనిఫాం, షూస్, కాస్మోటిక్ చార్జీలు వెంటనే అందించి వారిని ఆదుకోవాలని మల్లేశం కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest