UPDATES  

NEWS

ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

 హుండీ దొంగను పట్టుకున్న ఎస్సై ప్రవీణ్ కుమార్

ధర్మారం (తెలంగాణ వాణి)

గత కొంతకాలంగా పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం, సుల్తానాబాద్, పొత్కపల్లి మండలాలలో వివిధ గ్రామాల్లోని పలు దేవాలయాలలో ఉన్న హుండీలు పగులగొట్టి దొంగతనాలు చేస్తున్న కూకట్ల సదానందం ను పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతను దేవాలయాలలోని హుండీలే లక్ష్యంగా చేసుకొని వాటిని పగలగొట్టి అందులో ఉన్నవి దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. గురువారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సదానందం ధర్మారం మార్కెట్ యార్డ్ వద్ద తచ్చాడుతుండగా అతన్ని స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ తన పోలీసు సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకొని రిమాండ్ కు పంపినట్లు ఎస్సై తెలిపారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ మండలంలోని ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest