UPDATES  

NEWS

ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్ భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు. రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ

 ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇళ్లపై ఏసీబీ దాడులు..

వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరావు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ ఏక కాలంలో దాడుల నిర్వహణ

హనుమకొండ/ఖమ్మం(తెలంగాణవాణి):

వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వరరావు ఇళ్లపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో ఈ దాడులు కలకలం సృష్టించాయి.

తహసిల్దార్ నాగేశ్వరరావు స్వస్థలం అయిన హనుమకొండలోని చైతన్యపురిలో, అలాగే ఖమ్మం జిల్లాలోని ఆయన ఇళ్లపై ఏకకాలంలో సోదాలు మొదలయ్యాయి. అదే సమయంలో, ఖిలా వరంగల్ మండల తహసిల్దార్ కార్యాలయంలో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కార్యాలయంలోని సిబ్బందిని విచారించడంతో పాటు, కొన్ని రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా కాలంగా పనిచేస్తున్న బండి నాగేశ్వరరావు గతంలో హసన్‌పర్తి, కాజీపేట తహసిల్దార్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఈ ఏసీబీ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest