UPDATES  

NEWS

సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన

 ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

ప్రజానాయకుడు పొంగులేటి పై విషప్రచారమా

తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు

నోరు అదుపులో పెట్టుకోక పోతే ఇళ్లను ముట్టడి చేస్తాం

రేగళ్ల పెద్దతండా సర్పంచ్ లావుడ్య పూర్ణ

కొత్తగూడెం (తెలంగాణ వాణి) వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 245 వ్యవసాయ భూమిలో జరుగుతున్న భూ వివాదానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డికి, వారి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి కి ఎలాంటి సంబంధం లేద‌ని, రాఘవ కన్స్ట్రక్షన్స్ కు తాము ఏలాంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయలేదని వ‌ట్టినాగుల‌ప‌ల్లి య‌జ‌మానులు స్ప‌ష్టంగా చెప్తున్నప్పటికీ బిఆర్ఎస్ నాయ‌కులు కావాలనే విషప్రచారం చేస్తుండంపై రేగళ్ల పెద్ద తండా సర్పంచ్ లావుడ్య పూర్ణ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను చర్చించాల్సిన ప్రజా ప్రతినిధులు, చిల్లర వ్యక్తుల్లాగా ప్రవర్తిస్తు కేవలం కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బ తీసేలా తప్పుడు ప్రచారం చేయడం మాజీ మంత్రులు కేటిఆర్, హరీష్ రావు ల అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అన్నారు. అనవసర వివాదంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ని, రాఘవ కన్స్ట్రక్షన్స్ ని లాగి నిందారోపణలు చేస్తే బిఆర్ఎస్ నేతల ఇళ్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest