జనాభా గణన 2027 కార్యక్రమం సందర్భంగా ఏప్రిల్ 20 నుండి 25 వరకు నిర్వహించనున్న శిక్షణలో భాగంగా, మొదటి దఫా ఇండ్ల గణన మే 11 నుండి జూన్ 9 వరకు జరగనున్న నేపథ్యంలో పాల్వంచ మండల రూరల్ పరిధిలోని పాత ఆర్డిఓ కార్యాలయంలో సోమవారం ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని పాల్వంచ మండల తహసిల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ శిక్షణలో భాగంగా మొత్తం 36 మంది ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు.ముఖ్య అతిథిగా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సంజీవరావు హాజరయ్యారు. మండల గణాంక అధికారి వెంకటేశ్వర్లు, టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మణ్, ఫీల్డ్ ట్రైనర్లుగా జూనియర్ కాలేజీ లెక్చరర్ రవీందర్,ముంతాజ్ అలీ ఖాన్ శిక్షణ అందించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న జనాభా గణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకుంటూ,నిర్ణీత గడువులో శిక్షణ పూర్తి చేసి ఇండ్ల గణనను సక్రమంగా చేపట్టాలని సూచించారు. మండలానికి మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వ ఉపాధ్యాయులను అభ్యర్థించారు.

