UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 పోలీసుల అదుపులో దారి తప్పిన గురువు

పిల్లల పట్ల పైత్యపు చేష్టలు

తల్లితండ్రుల ఆగ్రహం

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

సమాజంలో గురువులకు ఎంతో గొప్ప స్థానం ఉంది. పిల్లలను తల్లిదండ్రులు కనీ పెంచినప్పటికీ.. వారికి విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో గొప్ప పొజీషన్ లో ఉండేలా చేసేది గురువులు మాత్రమే.

అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. విద్యార్థులు దారి తప్పితే వారిని సన్మార్గంలో నడిపించేవారే ఉపాధ్యాయులు. అలాంటిది ఈ మధ్య కాలంలో కొంతమంది గురువు స్థానాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. పాఠశాలకు మద్యం సేవించి రావడం, సహ ఉపాధ్యాయులు, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, విద్యార్థులను లైంగికంగా వేధించడం లాంటివి చేస్తున్నారు. కాగా శుక్రవారం విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ టీచర్ ని కొత్తగూడెం 1టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే కొత్తగూడెం, పోస్టాఫీసు సెంటర్ వద్ద గల సింగరేణి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విధ్యార్ధినులను తెలుగు ఉపాధ్యాయుడు వేణు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ, గిచ్చుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నడాని ఆరోపిస్తూ విధ్యార్ధునుల కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టగా రంగంలోకి దిగిన 1వ టౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించి ఉపాధ్యాయుడు వేణు ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest