UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

కాళోజికి నివాళులర్పించిన న్యాయవాద పరిషత్

నిజామాబాద్ సెప్టెంబర్ 09: (తెలంగాణ వాణి ప్రతినిధి)

ప్రజల గొంతుకై గళమెత్తిన కాళోజీ హైదరాబాద్ సంస్థాన విమోచన కోసం ఉద్యమం నడిపిన కాళోజీ నారాయణ రావు ప్రజాజీవితం ఆదర్శనీయమని ‌‌

‌న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. కాళోజీ111 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవితలు, కథలు రచించి ప్రజా ఉదయమానికి పూనాదులు వేశారని కొనియాడారు. నిజామ్ ప్రజా వ్యతిరేక పాలనకు నాటి ఉద్యమ నాయకులతో పోరుబాట నిర్మించారని తెలిపారు.హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో కలిసిన తర్వాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రం గా ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ భాషకు,సంస్కృతి కి,వనరులకు జరుగుతున్న నష్టం చూసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గళమెత్తిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, వసంత్ రావు నారాయణ దాస్ శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest