UPDATES  

NEWS

తూమ్ చౌదరి పార్టీ మారుతున్నారన్న ప్రచారం అవాస్తవం ఆగస్టు 27న ఉద్యోగుల ‘మహాధర్నా’ విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ బహుకరించిన రాజమౌళి- అరుణ దంపతులు ఇందిరమ్మ మోడల్ కాలనీలో విక్రయాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్

 రక్తపోటు పట్ల అప్రమత్తంగా వుండాలి

రక్తపోటు (బి.పి) పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తత తో వుండాలని అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ.హేమంత్ పిలుపు నిచ్చారు. శుక్రవారం మే,17 “ప్రపంచ రక్తపోటు దినం” సందర్భంగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇటీవల కాలంలో సమాజంలో రక్తపోటు బాధితుల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లోపించడం, ఫాస్ట్ పుడ్స్ కారణంగా చిన్న వయసులోనే రక్తపోటుకు గురవుతున్నారన్నారు. 30 సం.లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా రక్తపోటు (బి.పి) పరీక్షలు చేయించుకోవాలన్నారు. తగిన మందులు వాడాలని, నడక, వ్యాయామం చేయాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అసంక్రమిత వ్యాధుల నివారణ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌష్ఠికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. డాక్టరు సలహా ప్రకారం తగిన చికిత్స తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కేంద్ర ఆసుపత్రి సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్ధినులచే జిల్లా ఆసుపత్రి నుండి నెహ్రూచౌక్ వరకు రక్తపోటు పై అవగాహనా ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుటుంబ వైద్య విధాన సమన్వయ కర్త డాక్టర్ వీరజ్యోతి, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ శివరామకృష్ణ, ఎపిడమాలజిస్ట్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Date of Publish : 17 May 2024, 10:31 pm Posted by : TELANGANA VANI

రక్తపోటు పట్ల అప్రమత్తంగా వుండాలి

రక్తపోటు (బి.పి) పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తత తో వుండాలని అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ.హేమంత్ పిలుపు నిచ్చారు. శుక్రవారం మే,17 “ప్రపంచ రక్తపోటు దినం” సందర్భంగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇటీవల కాలంలో సమాజంలో రక్తపోటు బాధితుల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లోపించడం, ఫాస్ట్ పుడ్స్ కారణంగా చిన్న వయసులోనే రక్తపోటుకు గురవుతున్నారన్నారు. 30 సం.లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా రక్తపోటు (బి.పి) పరీక్షలు చేయించుకోవాలన్నారు. తగిన మందులు వాడాలని, నడక, వ్యాయామం చేయాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అసంక్రమిత వ్యాధుల నివారణ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌష్ఠికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. డాక్టరు సలహా ప్రకారం తగిన చికిత్స తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కేంద్ర ఆసుపత్రి సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్ధినులచే జిల్లా ఆసుపత్రి నుండి నెహ్రూచౌక్ వరకు రక్తపోటు పై అవగాహనా ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుటుంబ వైద్య విధాన సమన్వయ కర్త డాక్టర్ వీరజ్యోతి, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ శివరామకృష్ణ, ఎపిడమాలజిస్ట్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest