UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు PRTU TS జిల్లా అసోసియేట్ అధ్యక్షులు టి.రవీందర్ కు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యాసదస్సును జయప్రదం చేయండి:అశ్వాపురం మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ చంద్రు ఆళ్లపల్లి ఉప సర్పంచ్‌గా సయ్యద్ ఆరీఫ్ ను సన్మానించిన కిక్‌ బాక్సింగ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అర్షద్  పుట్టిన రోజు వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు పూణెం శ్రీనివాస్ నాగమణి దంపతులు పుట్టిన రోజు వేడుకలకు హాజరైన లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ తాటి అనిత తిరుమలేష్ దంపతులు మానవత్వం చాటుకున్న ఆటో భాయ్ అవీర్..అభినందించిన ATEC జిల్లా అధ్యక్షులు మాళోత్ బాలు నాయక్  నర్సంపేట బీసీ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం మొదటిసారిగా’ ఓ ‘ పాజిటివ్ రక్త దానం చేసిన అజార్ ఎన్నికలు ఏవైనా సిపిఐదే పైచేయి

 రక్తపోటు పట్ల అప్రమత్తంగా వుండాలి

రక్తపోటు (బి.పి) పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తత తో వుండాలని అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ.హేమంత్ పిలుపు నిచ్చారు. శుక్రవారం మే,17 “ప్రపంచ రక్తపోటు దినం” సందర్భంగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇటీవల కాలంలో సమాజంలో రక్తపోటు బాధితుల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లోపించడం, ఫాస్ట్ పుడ్స్ కారణంగా చిన్న వయసులోనే రక్తపోటుకు గురవుతున్నారన్నారు. 30 సం.లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా రక్తపోటు (బి.పి) పరీక్షలు చేయించుకోవాలన్నారు. తగిన మందులు వాడాలని, నడక, వ్యాయామం చేయాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అసంక్రమిత వ్యాధుల నివారణ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌష్ఠికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. డాక్టరు సలహా ప్రకారం తగిన చికిత్స తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కేంద్ర ఆసుపత్రి సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్ధినులచే జిల్లా ఆసుపత్రి నుండి నెహ్రూచౌక్ వరకు రక్తపోటు పై అవగాహనా ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుటుంబ వైద్య విధాన సమన్వయ కర్త డాక్టర్ వీరజ్యోతి, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ శివరామకృష్ణ, ఎపిడమాలజిస్ట్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest