UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 వరాహ నదిలో బయటపడ్డ అమ్మవారి విగ్రహం

అనకాపల్లి:జిల్లా ఎస్ రాయవరం మండలం  పెద ఉప్పలం గ్రామ సమీపంలో  వరహ నదిలో శక్తి రూపం బయటపడింది. పనికి ఉపాధి హామీ పథకం పనులు చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న గ్రామస్తులకు వరాహనదిలో అమ్మవారు విగ్రహం దర్శనమిచ్చింది. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం వాకపాడు గ్రామస్తులు ప్రతిరోజు ఉదయాన్నే పనికి ఆహార పథకంలో భాగంగా పనులు చేసుకుని తిరిగివస్తు వరాహనది లోనించి నడుచుకి వస్తుండగా సగం ఇసుకలో కూరుకుపోయిన రాతి విగ్రహం కంటపడింది. గ్రామస్తులు దగ్గరికి వెళ్లి విగ్రహాన్ని అతి కష్టం మీద పైకి లేపి నీటితో శుభ్రం చేశారు. అమ్మవారు శక్తి రూపంలో ఒక చేత ఖడ్గం మరోచేత డమరుకం మరో చేతిలో త్రిశూలం  మరో చేత కుంకుమ భరణి ధరించి ఉంది. శక్తి రూపంలో ఉన్న అమ్మవారు ఆసనంలో కూర్చుని అసుర సంహారం చేస్తూ దర్శనమిచ్చింది. అమ్మవారి శక్తి రూపం బయటపడటంతో చుట్టుపక్కల గ్రామాల వారు తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు. గ్రామంలో ఇప్పటివరకు అమ్మవారి గుడి లేదని అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలోకి తరలించి నిత్య పూజలు నిర్వహిస్తామని అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా వరాహనది పూర్తిగా ఎండిపోలేదని ఈ సంవత్సరం ఎండల తాకిడికి నది ఎండిపోయిందని దీంతో అమ్మవారి విగ్రహం బయటపడిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో పూర్వం బ్రాహ్మణులు నివాసం ఉంటూ  అమ్మవారిని ఆరాధించే వారిని అప్పటి కాలం నాటి విగ్రహం అయ్యుండొచ్చు అని అభిప్రాయాన్ని గ్రామస్తులు వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest