ఇల్లందు మండలంలోని చెన్నంగలగడ్డ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.పాఠశాల హెచ్ఎం బి.నామానాయక్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు,బలహీన వర్గాలు,మహిళల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని,విద్యార్థులు, పాల్గొన్నారు.
Post Views: 53