UPDATES  

NEWS

సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన

 పాఠశాలల సమీపంలోని చిరుతిండి దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

జిల్లాలోని బీసీ, ఎస్సీ, మైనారిటీ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు,ఏకలవ్య పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసి కార్యాలయంలో సంబంధిత జిల్లా అధికారులు, ఆహార భద్రత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇకపై కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం పరిశుభ్రంగా, నాణ్యంగా ఉండేలా ప్రత్యేక కార్యాచరణతో నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని తెలిపారు. ఆహారం కలుషితం కావడానికి గల కారణాలను ఆహార భద్రత అధికారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.పాఠశాలలు, వసతి గృహాల సమీప ప్రాంతాల్లో ఉన్న చిరు తిండ్ల దుకాణాలు, ఐస్‌క్రీమ్ బండ్లు మరియు ఇతర ఆహార విక్రయ కేంద్రాలపై ఆహార భద్రత అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. విక్రయించే ఆహార పదార్థాల గడువు తేదీలు, నాణ్యత, నిల్వ విధానాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. నాణ్యత లేని లేదా గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.పాఠశాలలకు బయట నుండి ఆహార పదార్థాలు తీసుకురావడం అనుమతించరాదని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలల వంటగదులు,భోజన శాలలు పరిశుభ్రంగా ఉండేలా సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.విద్యార్థుల ఆరోగ్య భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు.ఈ సమావేశంలో సీపీఓ సంజీవరావు, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ అధికారి శ్రీలత, ఆహార భద్రత అధికారి శరత్, ఆర్‌సీఓలు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest