UPDATES  

NEWS

రచ్చపల్లిలో ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు

 తెలంగాణ క్యాబినెట్‌లోకి కొత్త మంత్రులు

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు

డిప్యూటీ స్పీకర్ గా ఒకరు

హైదరాబాద్ (తెలంగాణ వాణి)

తెలంగాణ ప్రభుత్వంలో కొత్తగా ముగ్గురు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మధ్యాహ్న రాజభవన్ లో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రామ చంద్రునాయక్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, శాసనసభ ఉప సభాపతి బాధ్యతలు స్వీకరించిన రామచంద్రు నాయక్ లకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

సామాజిక న్యాయం ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యం అని సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు పదే పదే చెప్పినట్టుగానే కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest