UPDATES  

NEWS

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులని మర్యాదా పూర్వకముగా కలిసిన జాతీయ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి.మధుకర్. తెలంగాణ వాణి పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనం యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ దేశ వ్యాప్తంగా రక్త దాతలను అందిస్తున్న జె బి బాలు అభినందనీయులు ఎస్.ఎస్.స్సి బోర్డు నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావుకు మొక్కతో శుభాకాంక్షలు తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు పుట్టిన రోజు ఓ మొక్కను బహుమతిగా ఇవ్వండి: ప్రకృతి ప్రేమికుడు కళ్యాణ్ యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత యం.బాలు నాయక్ పుట్టిన రోజు మొక్కను నాటిన కె ఎన్ రాజశేఖర్ పదో తరగతి ఫలితాల్లో రేలకాయలపల్లి ప్రభంజనం..సమిష్టి కృషితోనే 100% ఫలితాలు: హెచ్ ఎం శ్రీనివాసరావు నాయక్ పదవ తరగతి ఫలితాల్లో పెంకె గీతిక విజయకేతనం….పలువురు అభినందనలు  పిల్లలలో మానసిక ధైర్యాన్ని నింపండి:-TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు A.రాంబాబు.

 తెలంగాణలో అత్యధికంగా కల్లు విక్రయాలు

తెలంగాణలో అత్యధికంగా కల్లు విక్రయాలు జరుగుతాయి. కల్లు అనేది పండుగల్లో సాకగా పరిగణిస్తారు. అమ్మవారి పూజల్లో ప్రధానంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంటిల్లిపాది కల్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే అది చెట్టు కల్లు మాత్రమే. అలాంటి కల్లుకు మరింత ప్రాధాన్యమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. కల్లు వృత్తికి గౌరవం తీసుకొస్తూ కొత్తగా ‘కల్లు బార్లు’ ఏర్పాటుచేయాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

 

మహబూబ్‌నగర్‌లో ఆదివారంలో ఏర్పాటుచేసిన గౌడ సంఘం సమ్మేళనంలో పొన్నం ప్రభాకర్‌ కీలక ప్రకటన చేశారు. ‘త్వరలోనే కల్లు బార్లు ఏర్పాటు దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో వివిధ కుల వృత్తులు కూడా మారుతున్నాయి. అన్ని రకాల వ్యాపారాల తీరు మారుతోంది. వాటితోపాటు గీత కార్మికుల వృత్తి కూడా మారాల్సి ఉంది. కల్లు గీత వృత్తిని ఆధునీకరించాల్సి ఉంది. కల్తీ కల్లు లేకుండా గౌరవప్రదంగా విక్రయించేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం’ అని తెలిపారు.

 

‘బార్‌ అండ్‌ రెస్టారెంట్ల మాదిరి కల్లు బార్లు ఏర్పాటుచేయబోతున్నాం. అన్ని కుల వృత్తులను ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నాం’ అని పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. కల్తీ కల్లు నివారణ కోసం ధర ఎక్కువైనా పర్లేదు కానీ స్వచ్ఛమైన కల్లు విక్రయించేలా చేస్తామన్నారు. పెద్ద పెద్ద దావత్‌లలో కూడా ఖరీదైన మందు బాటిళ్ల పక్కన కల్లు ఉండేలా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రకృతి నుంచి లభించే వస్తువును అంతే గౌరవప్రదంగా అమ్మేలా చేస్తానన్నారు. అన్ని కులవృత్తులకు అండగా ఉంటానని చెప్పారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ ఉచిత బస్సు పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులైంది. ఇప్పటివరకు 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు’ అని వివరించారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే కేంద్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest