UPDATES  

NEWS

 కేజీబీవీ,యుఆర్ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి:టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు

కేజీబీవీ, యుఆర్ఎస్ సిబ్బంది మరియు సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్. నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షుడు బి. రామ్ చంద్, ప్రధాన కార్యదర్శి ఎం. పుల్లయ్య ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొంటూ మహిళా ఉద్యోగులకు బేసిక్ పే, ఉద్యోగ-ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఈనెల 16న జిల్లా కేంద్రాల్లో, 20న ఛలో అసెంబ్లీ నిర్వహిస్తామని తెలిపారు.కార్యక్రమంలో హెచ్ఎం బి. లక్ష్మా, గిరి, శివాజీ, స్వరూప, తులసి, కవిత, అపర్ణ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest