UPDATES  

NEWS

ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత

 అల్పోర్స్ జూనియర్ కళాశాల లో వందేమాతరం వేడుకలు

తెలంగాణ వాణి, ఉమ్మడి వరంగల్ బ్యూరో, (నవంబర్ 08 ) : “వందేమాతరం” రచనకు 150 సంవత్సరాలు పూర్తైన ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని, అల్ఫోర్స్ జూనియర్ కాలేజ్, భీమారం, హనుమకొండ క్యాంపస్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్  నరేందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఉత్సాహంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో విద్యార్థులు వందేమాతరం గీతాన్ని ఆరాధనీయంగా ఆలపించి, భారత మాత పట్ల తమ అపారమైన ప్రేమ, గౌరవం మరియు కృతజ్ఞతను వ్యక్తపరిచారు.క్యాంపస్ అంతటా దేశభక్తి గానాలతో మార్మోగి పోగా, విద్యార్థుల స్వరాలు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరింపజేశాయి.ఈ  సందర్భంలో ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు మాట్లాడుతూ, వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన తీరు గురించి వివరించారు.ఈ గీతం మనకు అందించే ఏకతా, ధైర్యం, దేశభక్తి, త్యాగం వంటి విలువలను విద్యార్థులు తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు.విద్యార్థులు తమ దేశం పట్ల ప్రేమ, నిజాయితీ, సేవాభావం కలిగి ఉండి — “వందేమాతరం” యొక్క ఆత్మను నిలబెట్టాలని ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమం చివరలో అందరూ ఏకస్వరంతో “వందేమాతరం” నినదిస్తూ,క్యాం పస్ అంతా దేశభక్తి జ్వాలతో నిండిపోయింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest