UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 సిపిఎం కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు

స్థానిక మంచికంటి భవన్ లో గురువారం నాడు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సిపిఎం కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా కొమరయ్య చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె రమేష్ పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏజె రమేష్ మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి నైజాములకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహోన్నత వ్యక్తి,తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని పనికి పుచ్చుకొని భూమి లేని పేదలు ఈ భూమిపై ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతో ఆనాటి అమరవీరుల ఆశించిన లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు ఉద్యమించి పేదలు లేని రాజ్యాన్ని తీసుకురావాలని ఏజె రమేష్ అన్నారు.నాలుగు వేలమంది అమరులు అశువులు బాసిన చరిత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని బానిస వ్యవస్థను రద్దు చేయాలని, దున్నేవాడికే భూమి ఇవ్వాలని, కూడు,గుడ్డ,నివాసం కల్పించాలని జరిగిన మహత్తర పోరాటం నేటి తరానికి వివరించాలన్నారు. బంచెన్ అన్న బక్కోడితో బంధుకులు పట్టించి నైజాం రాజులకు వ్యతిరేకంగా గుండెను నిలిపిన అనేకమంది అమరవీరుల రక్త తర్పణమతో నిండి ఉన్న తెలంగాణ భూమిలో పేదల రాజ్యం కోసం ఎర్రజెండా స్థాపన కోసం ప్రతిన బునాలని ఆయన అన్నారు.నేటి కాంగ్రెస్ పరిపాలనలో పేద వర్గాలకు సంక్షేమ పథకాల అమలు విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ఆరు గ్యారంటీల అమలు కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి సర్వే నిర్వహించి ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.వీర తెలంగాణ వీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ పట్టణ కార్యదర్శు వర్గ సభ్యులు నందిపాటి రమేష్ , జునుమాలా నాగేష్,ఆప్టికట్ల జయశ్రీ, ఆవుల శ్రీరాములు, ఆలేటి శ్రీనివాసాచారి, అన్నవరపు ఇందిరా,నాగకృష్ణం, గడల నరసింహారావు,జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest