UPDATES  

NEWS

కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్ కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్ క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ రమణ రెడ్డి

 జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత విశ్వామిత్ర చౌహాన్ ను సన్మానించిన జిల్లా జడ్జి వసంత్ పాటిల్ 

పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీ కాన్సెప్ట్ తో గత మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ ను జిల్లా జడ్జి వసంత్ పాటిల్ ఘనంగా సన్మానించారు.ఇటీవల జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న విషయం తెలుసుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ ప్రత్యేకంగా విశ్వామిత్ర చౌహాన్ ను పిలిపించి శాలువతో సన్మానించారు. గతంలో చాలాసార్లు చిన్నారి తనతో మొక్కలు నాటారని గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా చిన్నారి విశ్వామిత్ర చౌహాన్ జడ్జి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం జడ్జి చిన్నారికి గ్రీన్ పెన్ను ఇచ్చి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశీర్వదించారు.చిరంజీవి విశ్వామిత్ర చౌహాన్ కు ఉన్నట్టే పర్యావరణం మీద ప్రతి ఒక్కరికి శ్రద్ధ ఉండాలని బాధ్యతగా మొక్కలు నాటాలని జడ్జి అన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest