UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇళ్లపై ఏసీబీ దాడులు..

వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరావు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ ఏక కాలంలో దాడుల నిర్వహణ

హనుమకొండ/ఖమ్మం(తెలంగాణవాణి):

వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వరరావు ఇళ్లపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో ఈ దాడులు కలకలం సృష్టించాయి.

తహసిల్దార్ నాగేశ్వరరావు స్వస్థలం అయిన హనుమకొండలోని చైతన్యపురిలో, అలాగే ఖమ్మం జిల్లాలోని ఆయన ఇళ్లపై ఏకకాలంలో సోదాలు మొదలయ్యాయి. అదే సమయంలో, ఖిలా వరంగల్ మండల తహసిల్దార్ కార్యాలయంలో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కార్యాలయంలోని సిబ్బందిని విచారించడంతో పాటు, కొన్ని రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా కాలంగా పనిచేస్తున్న బండి నాగేశ్వరరావు గతంలో హసన్‌పర్తి, కాజీపేట తహసిల్దార్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఈ ఏసీబీ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest