UPDATES  

NEWS

కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్ కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్ క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ రమణ రెడ్డి

 ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇళ్లపై ఏసీబీ దాడులు..

వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరావు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ ఏక కాలంలో దాడుల నిర్వహణ

హనుమకొండ/ఖమ్మం(తెలంగాణవాణి):

వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వరరావు ఇళ్లపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో ఈ దాడులు కలకలం సృష్టించాయి.

తహసిల్దార్ నాగేశ్వరరావు స్వస్థలం అయిన హనుమకొండలోని చైతన్యపురిలో, అలాగే ఖమ్మం జిల్లాలోని ఆయన ఇళ్లపై ఏకకాలంలో సోదాలు మొదలయ్యాయి. అదే సమయంలో, ఖిలా వరంగల్ మండల తహసిల్దార్ కార్యాలయంలో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కార్యాలయంలోని సిబ్బందిని విచారించడంతో పాటు, కొన్ని రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా కాలంగా పనిచేస్తున్న బండి నాగేశ్వరరావు గతంలో హసన్‌పర్తి, కాజీపేట తహసిల్దార్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఈ ఏసీబీ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest