UPDATES  

 అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్ 

వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని కోరిన తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ హరిలాల్ నాయక్, ప్రభుత్వం అదే నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.సాధారణ పాఠశాలల తరహాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా ఒంటిపూట బడి అమలు చేస్తూ, సమయాల్లో మార్పులు చేస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest