మల్లాపూర్ (తెలంగాణ వాణి) మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మండలంలోని ముత్యంపేటలో భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముత్యంపేటలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆర్ఎస్ ప్రవీణ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ పూలమాలలు వేశారు. అనంతరం మల్లాపూర్ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కి క్రేను సహాయంతో భారీ గజమాలను వేసి ఆహ్వానించారు. అనంతరం మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావ వసంతతొ పాటు కోరుట్ల నియోజకవర్గంలోని పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.